షాబాద్ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ శివారులో గల ఓ గదిలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు తనీఖీలు నిర్వహించారు. అందులో సుమారు 3.5 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయి అమ్ముతున్న సనాతన్రౌత్, బిక్రం రౌత్లను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడి కూలీలకు విక్రయిస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా గంజాయిని అమ్ముతున్నా వీరిద్దరిపై కేసు నమోదు చేసి చేవెళ్ల కోర్టులో హాజరుపరిచిన్నట్లు సీఐ తెలిపారు.