యాలాల : విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రియాలాల మండలం దేవనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనంతప్ప అనే వ్యక్తి రాత్రివేళ ట్రాక్టర్ నడిపిస్తూ గ్రామ బస్టాండ్ వద్ద ఉన్న ఓ విద్యుత్ స్తంభాన్ని ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం మీద పడి అనంతప్ప తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కొద్దిసేపటి తర్వాత అనంతప్ప మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా జరిగిన సంఘటనపై యాలాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.