కొందుర్గు : తన భర్త మృతిలో అనుమానం ఉందని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లెడు దరిగూడ మండలంలోని పద్మారం గ్రామంలో సోమవారం తాసిల్దారు విజయ్కుమార్ సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. 2021 అక్టోబర్ 09న పద్మారం గ్రామానికి చెందిన కావలి రాజు (28) ఉరేసుకుని మృతి చెందాడు. రాజు భార్య నిర్మల ప్రసవం కోసం తల్లిగారి ఉరుకు వెల్లింది. భార్య వచ్చేలోపు భర్త శవాన్ని ఉరితాడు నుంచి తీసి కింద పడుకోబెట్టారు. అనంతరం దహన సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తన భర్త మృతి చెందిన కొన్ని రోజులకే తనపై ఉన్న ఎకరం భూమిని వాళ్ల అన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.
దీంతో అనుమానం వచ్చిన భార్య నిర్మళ తన భర్త చావులో అనుమానం ఉందని 2021 డిసెంబర్ 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్మల ఫిర్యాదు మేరకు డాక్టర్లు రమానమూర్తి, సురేందర్రావులు సోమవారం రీ పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత తదుపరి దర్యాప్తు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.