బొంరాస్పేట : గుట్టు చప్పుడు కాకుండా పొలంలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగడిరాయిచూరులో చోటు చేసుకుంది. బుధవారం సీఐ అప్పయ్య కథనం ప్రకారం.. మండలంలోని అంగడిరాయిచూరు శివారులో ప్రకాష్, వెంకటయ్య, వెంకటేష్, సతీష్లకు చెందిన పొలాన్ని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బంటు చంద్రప్ప కౌలుకు తీసుకుని పత్తి, కంది పంట సాగు చేస్తున్నాడు. వీటిలో అంతర పంటగా ఒక సాలులో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు.
సమచారం తెలుసుకున్న సీఐ అప్పయ్య, డిప్యూటీ తాసిల్దార్ ఆనంద్తో కలిసి పొలానికి వెళ్లి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. 170 గంజాయి మొక్కలు ఉన్నట్లు సీఐ తెలిపారు. కౌలుదారుడు బంటు చంద్రప్ప పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ మెరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.