హైదరాబాద్: తన గర్ల్ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన ఒక యువకుడికి.. ప్రేయసి తల్లి కూల్డ్రింక్ ఇచ్చింది. అతి తాగిన తర్వాత అస్వస్థకు గురైన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. మొయీనాబాద్కు చెందిన షేక్ అయాజ్ అనే 19 ఏళ్ల యువకుడు 16 ఏళ్ల ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి తల్లికి తెలిసింది.
అప్పుడు అయాజ్ను పిలిపించి మాట్లాడిన ఆమె.. ఈ వయసులో ఇలాంటివి వద్దని గట్టిగా చెప్పింది. ఈ క్రమంలోనే సదరు యువతి ఫిర్యాదుతో అయాజ్పై పోక్సో చట్టంపై కేసు కూడా నమోదైంది. అయినా సరే అయాజ్ మారలేదు. ఆ అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల క్రితం గర్ల్ఫ్రెండ్ ఇంటికెళ్లాడతను.
అప్పుడే అతనికి ఆ అమ్మాయి తల్లి కూల్డ్రింక్ ఇచ్చింది. అది తాగి ఇంటికొచ్చిన అయాజ్ అనారోగ్యం పాలయ్యాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ప్రయోజనం లేకపోయింది. చివరకు సోమవారం ఉదయం అతను చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అయాజ్ గర్ల్ఫ్రెండ్ తల్లిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.