పల్లెటూళ్లలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని నమ్మి కొందరు క్రూర చర్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా జార్ఖండ్లో వెలుగు చూసింది. గుమ్లా గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను గ్రామస్థులంతా కలిసి స్తంభానికి కట్టేశారు. గంటపాటు తీవ్రంగా కొట్టి హింసించారు.
అనంతరం ఒక యువకుడి కన్ను పీకేశారు. ఇదంతా ఎందుకు చేశారంటే.. ఆ యువకుల తల్లిదండ్రులు క్షుద్ర పూజలు చేస్తున్నారనేది గ్రామస్థుల వాదన. ఈ కారణంగానే యువకులను కట్టేసి కొట్టి, ఇలా కన్ను పీకేశారట.
ఇలా తమను గ్రామస్థులంతా కలిసి హింసించడం ఇది మూడోసారని ఆ యువకులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.