కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తిపై కత్తితో దాడిచేశాడో నిందితుడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సదరు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కూడా నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. కాలా బాదల్ ఉరఫ్ వీరేందర్ అనే వ్యక్తి.. కొన్నిరోజుల క్రితం ఢిల్లీ జలబోర్డులో డ్రైవర్గా పనిచేసే సునీల్ను కత్తితో పొడిచాడు.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. కాలా బాదల్ ఒక ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. దాంతో ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ సమయంలోనే కానిస్టేబుల్ను నిందితుడు కత్తితో పొడిచాడు. అది చూసిన ఏఎస్ఐ తుపాకీతో వీరేందర్ తొడపై కాల్పులు జరిపాడు. నిందితుడు, కానిస్టేబుల్ ఇద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారని, వాళ్ల ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు.