పెళ్లి చేసుకొని వధువును ఇంటికి తీసుకెళ్తుండగా పోలీసులు ఆ నవదంపతులను అరెస్టు చేశారు. వారితోపాటు ఉన్న కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గుజరాత్లోని వాల్సాద్ ప్రాంతంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని నిలువరించేందుకు పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. గుజరాత్లో కూడా ఈ నిబంధన అమలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సోమవారం రాత్రి పెళ్లి చేసుకున్న పీయూష్ పటేల్ (24), సోనాల్ జంట.. అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్లేందుకు కారులో బయలుదేరింది.
వీరి వెనుకే మరో రెండు కార్లలో మిగతా బంధువులు బయలుదేరారు. వీళ్లందరినీ అర్ధరాత్రి 12.20 గంటలకు ఒక ఓవర్ బ్రిడ్జిపై పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.