రెండ్రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఒక యువకుడికి దారుణమైన అనుభవం ఎదురైంది. పెళ్లి సమయంలో తనకు ఇచ్చిన బహుమతులను ఓపెన్ చేస్తుండగా ఘోరం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లోని నవసారి జిల్లాలో మింధాబరి అనే గ్రామం ఉంది. ఇక్కడ నివశించే లతీష్ గావిట్.. తమ పక్కన ఉండే గంగాపూర్ గ్రామానికి చెందిన ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి జరిగిన రెండ్రోజుల తర్వాత తమకు స్నేహితులు, బంధువులు ఇచ్చిన గిఫ్టు బాక్సులు ఓపెన్ చేయడానికి కూర్చున్నారు. మేనల్లుడితో కలిసి గిఫ్ట్ బాక్సులు ఓపెన్ చేస్తుండగా.. ఒక బొమ్మ కనిపించింది. దానికి చార్జింగ్ అయిపోవడంతో.. చార్జింగ్ పెట్టారు. అయితే అలా చార్జింగ్ పెట్టిన కాసేపటికే ఆ బొమ్మ ఢాం అంటూ పెద్ద చప్పుడు చేస్తూ పేలిపోయింది.
ఈ ప్రమాదంలో కొత్త పెళ్లి కొడుకు చేతులు, తల, కళ్లకు తీవ్రమైన గాయలయ్యాయి. అతని కుడి చెయ్యి మణికట్టు వరకు తెగి అవతల పడింది. మేనల్లుడు జైన్ తలకు, కళ్లకు బాగా దెబ్బలు తగిలాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పెళ్లి కూతురి అక్క మాజీ ప్రియుడైన రాజు పటేల్ అనే వ్యక్తి.. ఆ గిఫ్ట్ పంపించినట్లు దర్యాప్తులో తేలింది.