వెల్దండ : కూలి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పని ముగించుకొని ఇంటికి బయలు దేరిన సమయంలో జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ ఘటన పలుగు తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన నేనావత్ రెడ్యా నాయక్(35) ఇదే తండాలోని ఓ ఇంటి నిర్మాణ పనుల్లో కూలీగా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పని ముగిసింది. ఇంటికి వెళ్లేందుకు రెడీ అయి, తోటి కూలీలతో ఏదో విషయమై పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడు. ఇంతలో సడెన్గా ఆ ఇంటి గోడ కూలింది. కూలిన ఆ గోడ నేరుగా వచ్చి రెడ్యానాయక్ మెడ మీద పడింది. దీంతో అతని తల, మొండెం వేరయ్యాయి. రెండూ విడిపోయి చెరోదిక్కన పడిపోయాయి.
రెడ్యానాయక్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలు చూసిన తోటి కూలీలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన తండా వాసులు, రెడ్యా నాయక్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.