ఒక రైతు తన దొడ్డిలో పశువులు పెంచుకుంటున్నాడు. తన దగ్గర ఉన్న ఆవులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వాటికి ఏమైనా జరిగితే తెలుసుకోవాలని అక్కడ సీసీ కెమెరాలు కూడా సెట్ చేశాడు. ఇటీవల ఆ సీసీ ఫుటేజిని పరిశీలిస్తుండగా షాకింగ్ దృశ్యాలు కనిపించాయతనికి. ఎవరో ఒక వ్యక్తి.. ఆవుపై అత్యాచారం చేస్తూ కనిపించాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో వెలుగు చూసింది. స్థానికంగా నివశించే జితేంద్ర యాదవ్ అనే వ్యక్తి.. దగ్గర కొన్ని ఆవులు ఉన్నాయి. అవి ఉండే ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాడు. పొరుగింట్లో ఉండే వ్యక్తి ఆ ఫుటేజిని పరిశీలిస్తుండగా.. ఆవుపై అత్యాచారం చేస్తున్న మజిద్ అనే వ్యక్తిని గుర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న జితేంద్ర షాకయ్యాడు. ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి తాము కూడా మజిద్ చేసిన అకృత్యాన్ని చూశామని చెప్పారు. దీంతో జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల.. మజిద్ను అదుపులోకి తీసుకున్నారు.