పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపాల్టీ కేంద్రంలో ఉన్న ఓ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుమున గోదాంలో పెద్దపెద్ద శబ్ధాలతో మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే.. మున్సిపాల్టీ కేంద్రంలో ఉన్న స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో శుక్రవారం తెల్లవారుమున హఠాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు, అధికారులకు, ఫైర్ సిబ్బందికి సమాచార ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గోదాంలోకి వెళ్లలేని పరిస్థితి ఉండడంతో జేసీబీల సహాయంతో గోదాం గోడలను పగులగొట్టి మంటలను ఆర్పారు. ఇదిలా ఉంటే గోదాంలో ఉన్న సరుకు ఎమిటనే విషయం తెలియాల్సి ఉంది.
పంటపొలాలకు కొట్టే కెమికల్ మందులు అని స్థానికులు చర్చించుకుంటున్నారు. భారీ శబ్దాలతో మంటలు వస్తుండడంతో ఇంకేమైన మందులు ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోదాంకు సంబందించిన యజమాని అందుబాటులో లేనట్లు సమాచారం. పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, హయత్నగర్ సీఐ సురేందర్, స్థానిక కౌన్సిలర్లు చల్లూరి మురళీధర్రెడ్డి, కృష్ణారెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు పరిస్థితిని సమీక్షించి, కెమికల్ మంటల కారణంగా వస్తున్న పొగలతో ప్రజల ఆరోగ్యాలు పాడవుతాయని జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు. హయత్నగర్ పోలీసులు సంఘటన సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు.