తల్లిదండ్రుల తర్వాత పూజనీయమైన స్థానంలో ఉండే గురువే నీచంగా ప్రవర్తించాడు. విద్యార్థినిని తన గదిలోకి పిలిపించుకొని ముద్దులు పెడుతూ కనిపించాడు. మిగతా స్టూడెంట్లలో కొందరు ఈ ఉదంతాన్ని వీడియోలు తీయడంతో ఈ నీచం బయటపడింది.
కర్ణాటకలోని హెచ్.డి. కోటె టౌన్లో ఇది జరిగింది. మైసూరు జిల్లాలోని ఒక స్కూలు హెడ్మాస్టర్ తన ఛాంబర్లోకి వచ్చిన ఒక విద్యార్థినికి ముద్దులు పెట్టాడు. దీన్ని వేరే విద్యార్థులు కిటికీలో నుంచి వీడియో తీశారు. ఇలా వీడియో తీస్తున్నట్లు గమనించిన విద్యార్థిని.. హెడ్మాస్టర్ నుంచి దూరంగా జరిగింది.
వెంటనే కిటికీ వద్దకు వచ్చిన హెడ్మాస్టర్ను చూసి వీడియో తీస్తున్న విద్యార్థులు పరుగులు తీశారు. ఈ వీడియో బయటకు రావడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. సదరు హెడ్మాస్టర్పై చర్యలు తీసుకోవాలంటూ గొడవ చేశారు. ఈ క్రమంలో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.