హైదరాబాద్: నగరంలో ఒంటరి మహిళలే అతని లక్ష్యం. అతని కన్నుపడిందా అంతే సంగతులు. తను అనుకున్నది సాధించి కానీ వెనుతిరగడు. ఇలా నగరంలో వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఓటీ పోలీసులు.. నిందితుడిని అహ్మదాబాద్లో అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని పాత నేరస్థుడైన ఉమేశ్గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 19న ఉమేష్.. నగరంలో ఏకంగా ఐదు చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు అధికారులు చెప్పారు. ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా ఉమేష్ ఈ నేరాలకు పాల్పడేవాడు.
స్కూటీపై ప్రయాణిస్తూ గొలుసులు లాక్కెళ్లేవాడు. షేట్బషీరాబాద్, మారేడ్పల్లి, తుకారంగేట్ పరిధిలో ఈ చైన్ స్నాచింగ్లు చేశాడు. మేడిపల్లి పీఎస్ పరిధిలో కూడా ఉమేష్ ఈ గొలుసు చోరీలు చేశాడు. ఇప్పటికే నిందితుడు ఉపయోగించిన స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.