ములుగు : పిడుడగు పాటుకు ఓ యువతి మృత్యువాత పడింది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రమ్య(18) ఎప్పటిలాగే తమ పొలం వద్ద పని చేస్తుండగా..సోమవారం మధ్యాహ్నం పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. రమ్య మృతితో కుటుంబ సంభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
విషాదం : పెద్దాపూర్లో పిడుగు పాటుకు ఇద్దరు మృతి
Biggboss Season 5 Telugu| రెండో వారం నామినేషన్స్లో ఉన్నది వీళ్లేనా..?