కొందుర్గు : విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొందుర్గు మండలంలోని చెర్కుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల రాజు(45) తన వ్యవసాయ పొలంలో గల బోరు మోటరుకు విద్యుత్ సరఫరా రాకోవడంతో పక్కెనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెల్లాడు. అక్కడ ఉన్న ఏవీ స్విచ్చును సరిగ్గా ఆఫ్ చేయకుండా విద్యుత్ వైర్లను పట్టుకున్నాడు. దీంతో రాజుకు షాక్ తగిలి పడిపోయాడు.
రాజుకు విద్యత్ షాక్ తగిలిన విషయాన్ని పక్క పొలాల వారు గమనించి చికిత్స నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దవాఖానకు చెరుకున్న కొద్ది సేపటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు మృతుడు రాజు భార్యలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.