ధారూరు : ప్రమాదవశాత్తు మోటర్ సైకిల్ అదుపు తప్పి కిందపడి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం ధారూరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ధారూరు మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన రేగోండి యాదయ్య(35) తన బైక్ (టిఎస్ 34 2714) పై ధారూరు మండల కేంద్రానికి పని నిమిత్తం వెళ్లి పని ముగించుకోని తిరిగి తన స్వగ్రామానికి వస్తున్న సమయంలో రుద్రారం గ్రామ సమీపంలో ఉన్న కోళ్లఫారం వద్ద తన బైక్ అదుపుతప్పి కింద పడగా తలకు బలమైన గాయం కావడంతో గ్రామస్తులు, స్థానికులు, కుటుంబ సభ్యులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతిడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు. మృతిడి భార్య రేగోండి అనసూజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమని ఎస్ఐ-2 శైలజ తెలిపారు.