నందిగామ : లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన నందిగామ పాతజాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన చంటి వినోద్ (24) స్వీప్ట్ కారులో నందిగామ నుంచి అప్పారెడ్డిగూడ గ్రామానికి వెళ్తుండగా కమల్ వైనరిస్ పరిశ్రమ సమీపంలోకి రాగానే ముందు నుంచి వస్తున్న లారీని మరో లారీ ఓవర్ టెక్ చేసే క్రమంలో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహంతో పరిశ్రమ ఎదుట ఆందోళన..
మండలంలోని శివశక్తి పరిశ్రమకు ముడిసరుకులు తరలించే లారీ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో వినోద్ మృతి చెందడంటూ వినోద్ మృతదేహాంతో అప్పారెడ్డిగూడ గ్రామస్తులు శివశక్తి పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో లారీ యజమాని రూ. 1 లక్ష, పరిశ్రమ యాజమాన్యం రూ. 50వేలు ఇచ్చేందుకు అంగికరించారు. దీంతో ఆందోళన విరమించి అంత్యక్రియలు నిర్వహించారు.