నవాబుపేట : భార్య పుట్టింటికి వెళ్లి రావడం లేదని భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబుపేట మండలంలోని చించల్పేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చాకలి మహేశ్ (30) కొద్ది రోజులుగా ఇద్దరు భార్యభర్తలు గొడవలు పడుతూ ఉన్నారు. భార్య గత నెలా 4వ తేదీన తన తల్లిగారి ఊరికి పిల్లలను తీసుకుని వెళ్లగా తర్వాత మహేశ్ భార్యను తీసుకురావడానికి వెళ్లాడు. అక్కడ కూడా భార్యతో గొడవపడి పురుగుల మందు తాగగా చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం మహేశ్ని చించల్పేట గ్రామానికి పంపి కొన్ని రోజులకు మహిళ మండలంలో భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
కౌన్సిలింగ్ తరువాత కూడా భార్య కాపురానికి రావడంలేదనే మనస్థాపంతో శనివారం రాత్రి ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో తన భార్య చిరతోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.