నల్లబెల్లి : ఓ మహిళపై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండారు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడెపల్లి గొల్లపల్లె గ్రామానికి చెందిన గాదం కేతమ్మ అనే మహిళ రుద్రగూడెం గ్రామంలో తన పొలంలో వరికోస్తుండగా గాదం మహిపాల్, గాదం మానస అనే ఇద్దరు వ్యక్తులు కలిసి కేతమ్మపై కత్తులు, గొడ్డలితో దాడికి పాల్పడ్డారని తెలిపారు. బాధితురాలు కేతమ్మ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.