కృష్ణకాలనీ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన పలకల హర్షవర్థన్ రెడ్డి అనే యువకుడు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరానికి చెందిన ఓ యువతీపై పోట్రోల్ పోసి, తాను పోసుకుని గాయలపాలైన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన పలకల రాంరెడ్డి, మంజుల దంపతుల కుమారుడు పలకల హర్షవర్థన్ రెడ్డి (21). వీరి స్వగ్రామం కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలంలోని గద్దపాక. రాంరెడ్డి, మంజుల దంపతులు ఉద్యోగరీత్య బదిలీపై భూపాలపల్లికి వచ్చి గత 15 సంవత్సరాలుగా భూపాలపల్లిలోని కేటీకే 8వ గణిలో జనరల్ మజ్ధూర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
వారి కుమారుడు హర్షవర్థన్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఇంట్లోనే ఆన్లైన్ ద్వారా సాప్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఐదు రోజుల క్రితం తన తల్లీ మంజులకు హైదరాబాద్ వెళ్తున్నాని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. కాగా శనివారం విశాఖలో ఓ యువతీ ప్రేమించి పెళ్లికి నిరాకరించందని ఆ యువతీపై పెట్రోల్ పోసి, తాను పోసుకుని గాయాలై పాలైనాడని తల్లీదండ్రులకు తెలువడంతో వెంటనే విశాఖకు బయలుదేరి వెళ్లారని స్థానికులు చర్చించుకుంటున్నారు. హర్షవర్థన్రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎవ్వరితో మాట్లాడేవాడు కాదని మంచి మనసుకున్నవాడని స్థానికులు అంటున్నారు.