ధారూరు : ప్రమాదవశాత్తు కోట్పల్లి ప్రాజెక్టులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోట్పల్లి మండల కేంద్రానికి చెందిన చాకలి అఖిలేష్ (20) కోట్పల్లి ప్రాజెక్టు చూడటానికి వెళ్లి ప్రమాదవశాత్తు చిన్న అలుగులో పడి మృతి చెందాడు. మృతిడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ధారూరు ఎస్ఐ నరేందర్ తెలిపారు.