తాండూరు : గడ్డివాములో యువకుడు కాలి మృతి చెందిన సంఘటన బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని మల్రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్రెడ్డిపల్లికి చెందిన రాములు కొడుకు నవీన్ (23) వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా పని చేసేవాడు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన నవీన్ ఇంటికి తిరిగి రాలేడు. స్నేహితుల దగ్గరకు వెళ్లి ఉంటారని అనుకొని కుటుంబ సభ్యులు పడుకున్నారు. బుధవారం తెల్లవారు జామున వారి పొలం దగ్గర గడ్డివాము అంటుకుందని స్థానికులు సమాచారం ఇచ్చారు. గడ్డి వాము అంటుకోవడంతో లబోదిబోమంటు వెళ్లిన కుటుంబ సభ్యులు గడ్డివాములో కొడుకు శవం చూసి సొమ్మసిల్లి పడిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పలు అనుమానాలు ఉన్నట్లు బంధువులు పేర్కొన్నారు.