హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ రాగానే బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో బెట్టింగ్కు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ గ్యాంగ్ యానాం నుంచి క్రికెట్ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు.
బెట్టింగ్ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు సాయిరాం పరారీలో ఉన్నాడు. మరో ఇద్దరు కీలక నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ. 56 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఒక ల్యాప్ టాప్, మారుతి కారు, రెండు బైక్లతో పాటు 9 సెల్ఫోన్లను సీజ్ చేశారు. నాగరాజు అనే నిందితుడు 2016లోనూ అరెస్టు అయ్యాడు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలన్నారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్కు పాల్పడకుండా చూడాలని సూచించారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లు సమాచారం అందితే 94906 17111 నంబర్కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.