హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని తోలుకట్ట వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఓ ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది.
ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమ చావుకు ఎవరూ కారణం కాదని ఆ దంపతులు లేఖలో పేర్కొన్నారు. పురుగుల మందు తాగి వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులను శివరాంపల్లికి చెందిన రాజేశ్, ఖుష్భూగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.