Couple | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం సేలెం (Salem)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీల మధ్య నలిగి దంపతులు దుర్మరణం చెందారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
భవన నిర్మాణ కార్మికుడైన అలగరసన్ (30) తన భార్య ఇలమతి (25), ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై పన్నావడి వైపు వెళ్తున్నాడు. రామన్ నగర్ సమీపంలోకి రాగానే వారు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ముందు వాహనాలు ఆగిపోవడంతో వారు ఓ ట్యాంకర్ లారీ వెనుక ఆగి ఉన్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ.. ముందు ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. అనంతరం అలానే ముందుకు వెళ్లింది. దీంతో దంపతులిద్దరూ ముందు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి కిందపడిపోయారు. ఈ క్రమంలో లారీ టైర్ల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అదృష్టవశాత్తు వారి పిల్లలు కృతిక్ (2), కిషోర్ (5) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న కారుమలైకూడల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరు చిన్నారుల్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెట్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
சேலம் மாவட்டம் மேட்டூர் அருகே லாரி ஓட்டுநரின் கவனக்குறைவால் இருசக்கர வாகனத்தில் சென்ற தம்பதி, சம்பவ இடத்திலேயே உயிரிழப்பு.#Salem | #Accident pic.twitter.com/HU1hCMpsUt
— My Salem City (@MySalemCity) January 28, 2024
Also Read..
Rajya Sabha | రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Rajasthan | అమ్మా, నాన్న.. ఈ జేఈఈ నావల్ల కాదు.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
Snowfall | కొత్త అందాలను సంతరించుకున్న కశ్మీర్ వ్యాలీ.. VIDEO