హైదరాబాద్: భాగ్యనగరంలో నకిలీ నోట్లు కలకల రేపాయి. గోల్కొండ పరిధిలో రూ.2 కోట్ల నకిలీ కరెన్సీ దొరికింది. నకిలీ కరెన్సీ సమాచారం అందుకున్న పోలీసులు చేసిన తనిఖీల్లో ఈ సొమ్ము బయటపడింది. ఈ నోట్లతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుల వద్ద ఉన్న సంచుల్లో రూ.2 వేలు, రూ.5 వందల కరెన్సీ నోట్లు ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.