అహ్మదాబాద్ : పూజారి (38) హత్య కేసులో ఇద్దరు నిందితులను అహ్మదాబాద్లోని కృష్ణనగర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడిని సజీపూర్లోని బలియదేవ్, సీతామాత ఆలయ పూజరిగా పనిచేసే ఆసిష్ అలియాస్ లాలో గోస్వామిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయానికి సమీపంలోని ఈ క్రోం ఎక్స్ప్రెస్లో ఆదివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు కంపెనీ సెక్యూరిటీ గార్డుతో గొడవపడ్డారు.
వీరి మధ్య ఘర్షణ జరుగుతుండగా ఆసిష్ అక్కడికి వెళ్లి వారికి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించాడు. కోపోద్రిక్తులైన నిందితులు కమలేష్ ఖుమన్, మనీష్ సగతియా ఆసిష్ ప్రైవేట్ భాగాలపై కత్తితో దాడిచేశారు. పలుమార్లు విచక్షణా రహితంగా కత్తిపోట్లకు గురిచేశారు. బాధితుడిని సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు.