చెన్నై : తమిళనాడులోని కూనూరులో దారుణం వెలుగుచూసింది. పన్నెండో తరగతి చదివే బాలికపై గురువారం కత్తితో దాడి చేసిన వ్యక్తి మూడుసార్లు పొడిచాడు. బాధితురాలిని హుటాహుటిన కూనూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు.
ఆ సమయంలో అటుగా వెళుతున్న ప్రజలు నిందితుడిని అడ్డగించి దేహశుద్ధి చేశారు. నిందితుడి చేతులు, కాళ్లను తాడుతో కట్టేయగా అతడు రోడ్డుపై కూర్చుని ఉండగా చుట్టూ జనం మూగి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.