హైదరాబాద్ : అబిడ్స్ పరిధిలోని ట్రూప్ బజార్లోని గోదాముల్లో దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. గోదాముల్లో భారీగా నకిలీ సిగరెట్లు నిల్వ చేసినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి, రూ. 2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గోదాముల్లో నకిలీ సిగరెట్లను నిల్వ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.