భువనేశ్వర్ : దుబాయ్, సింగపూర్లో ప్రదర్శనలు ఇప్పిస్తానని మభ్యపెడుతూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ పలువురు డ్యాన్సర్ల నుంచి రూ 3.4 లక్షలు దండుకుని టోకరా వేసింది. కొరియోగ్రాఫర్ మోసంపై బాధిత డ్యాన్సర్లు పోలీస్ కమిషనర్ సుమేంద్ర ప్రియదర్శిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిందితురాలు షెఫాలిక మహంతిపై చర్యలు చేపట్టాలని వారు కమిషరన్కు విజ్ఞప్తి చేశారు.
బాధిత డ్యాన్సర్లు తెలిపిన వివరాల ప్రకారం..కొరియోగ్రాఫర్ మహంతి దుబాయ్, సింగపూర్లో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని నమ్మబలికి చిన్నారులు సహా 20 మంది డ్యాన్సర్లను మోసగించింది. బాధితులు అంతా కలిపి రూ విదేశాల్లో ప్రదర్శలను ఏర్పాటు చేసేందుకు మహంతికి రూ 3.4 లక్షలు చెల్లించారు. ఎన్ని రోజులు గడిచినా మహంతి విదేశీ ప్రదర్శనల ఊసెత్తకపోవడంతో తమ దగ్గర వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇవ్వాలని డ్యాన్సర్లు ఆమెను కోరారు. నెలల తరబడి ఆమె సొమ్ము తిరిగిఇవ్వకపోవడంతో బాధితులు జూన్ 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్పై చేసిన ఆరోపణలపై తాము విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.