Chennai Techi | రోడ్డుపై ఉన్న భారీ గుంతను తప్పించబోయే క్రమంలో ట్రక్కు ఢీ కొట్టి 22 ఏండ్ల టెకీ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చెన్నైలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శోభన (22).. చెన్నైలోని జోహో కార్పొరేషన్ లిమిటెడ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. మంగళవారం తన సోదరుడిని కోచింగ్ సెంటర్లో దిగబెట్టేందుకు స్కూటీపై బయలు దేరింది. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించపోయి కిందపడిపోయింది. ఆ సమయంలో అటువైపు వచ్చిన ఓ ట్రక్కు యువతిని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో శోభన సోదరుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
అయితే ప్రమాద సమయంలో వారెవరూ హెల్మెట్ ధరించలేదని పోలీసులు తెలిపారు. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం కారణంగా యువతి మరణానికి కారణమయ్యారనే ఆరోపణలపై ట్రక్ డ్రైవర్ మోహన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శోభన మృతి వార్త తెలుసుకున్న జోహో కంపెనీ సీఈవో శ్రీధర్ వెంబు.. ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
One of our engineers, Ms. Shobana died tragically when her scooter skidded in the heavily potholed roads near Maduravoyal in Chennai. She was taking her younger brother to school.
Our bad roads have caused a
tragic loss to her family and Zoho. https://t.co/8XAycPhIsk pic.twitter.com/JlX5roD6DS— Sridhar Vembu (@svembu) January 3, 2023