జగిత్యాల : జగిత్యాల బస్టాండ్ సులభ్ కాంప్లెక్స్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. బస్టాండ్ వద్దకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు.
ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా? లేకా ప్రమాదవశాత్తు మరణించాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.