న్యూఢిల్లీ : రూ 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్ఐ నుంచి రూ 1.12 కోట్లను సీబీఐ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్ ఎస్ఐ భోజ్రాజ్ సింగ్ ఫిర్యాదుదారు నుంచి రూ 50,000 లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డాడు.
మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో తనకు, తన స్నేహితుడికి సాయం చేయడంతో పాటు బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించకుండా ఉండేందుకు తమను రూ 5 లక్షల లంచం అడిగాడని ఎస్ఐపై ఫిర్యాదుదారు సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఫిర్యాదుదారు నుంచి రూ 50,000 లంచం తీసుకుంటుండగా ఎస్ఐ సింగ్ను సీబీఐ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆపై సోదాలు చేపట్టగా ఎస్ఐ కారులో రూ 5.4 లక్షలు పట్టుబడగా, ఇంటి నుంచి రూ 1.07 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.