కాచిగూడ : బెంగళూర్కు చెందిన ఓ వ్యక్తి ఆటోలో నగదు, విలువైన సర్టిఫికేట్స్ మరచిపోయిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూర్లోని బెన్సెన్ టౌన్ ప్రాంతానికి చెందిన రామమూర్తి (37) ఉద్యోగం కోసం బెంగళూర్ నుండి హైద్రాబాద్కు వచ్చాడు.
గురువారం ఉదయం కాచిగూడ రైల్వేస్టేషన్లో దిగిన ఆయన ఉద్యోగ అన్వేషణ కోసం నగరంలోని ఐటెక్ సిటీకి వెళ్లడానికి కాచిగూడ రైల్వేస్టేషన్ లో ఆటో ఎక్కాడు. అంతలోనే ఆతని బ్యాగులోని రూ.7,900రూపాయలు, విలువైన సర్టిఫికేట్స్ మాయమైనట్లు గుర్తించాడు. వెంటనే రామమూర్తి కాచిగూడ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.