అశ్వారావుపేట: మైనర్ బాలికను మోసం చేసి వివాహం చేసుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మండలంలోని గుమ్మడవల్లి గ్రామానికి చెందిన శివరామకృష్ణ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆలయంలో వివాహం చేసుకుని అశ్వారావుపేటలో మకాం పెట్టాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శివరామకృష్ణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై రామ్మూర్తి తెలిపారు.