ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గట్కోపర్ ప్రాంతం అది. ఆ రహదారిపై ఆటోలు, ఇతర వాహనాలు వేగంగా కదులుతున్నాయి. స్కూల్ పిల్లలు, ప్రయాణికులతో రద్దీగా ఉంది ఆ దారి. అంతలోనే ఓ కారు అతి వేగంతో దూసుకొచ్చింది. వరుసగా మూడు ఆటోలను కారు ఢీకొట్టింది. కారు వేగంగా దూసుకు రావడాన్ని ముందే పసిగట్టిన స్కూల్ పిల్లలు పక్కకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు.
#WATCH मुंबई: घाटकोपर इलाके में एक कार की चपेट में आने से 8 लोग घायल हैं और 2 लोग गंभीर रूप से घायल हुए हैं। चालक को गिरफ्तार कर लिया गया है। घटना दोपहर एक बजे की है। आगे की कार्रवाई जारी है।
(वीडियो सोर्स: मुंबई पुलिस) pic.twitter.com/9gY5SEEXZp
— ANI_HindiNews (@AHindinews) September 21, 2022