వేములవాడ : పట్టణంలోని కేదారేశ్వర ఆలయం సమీపంలో నిలిపి ఉన్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్యామల శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇండియా కారు ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశాడు. అయితే, ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైనట్లు పేర్కొన్నారు. అధికారులు మంటలు అదుపు చేయడంతో స్థానకులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, దగ్ధం కావడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.