ఈ మధ్య కాలంలో దొంగలు మరీ తెలివి మీరిపోయారు. కొత్త కొత్త విధానాల్లో దొంగతనాలు చేస్తూ సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఒక క్యాబ్ డ్రైవర్.. తన క్యాబ్ ఎక్కిన ప్రయాణీకురాలిని బురిడీ కొట్టించాడు.
సదరు మహిళ మొబైల్ కొట్టేస్తే డౌట్ వస్తుందని అనుకున్నాడేమో.. జస్ట్ సిమ్ కార్డు మాత్రమే దొంగిలించాడు. దాన్ని తన మొబైల్లో వేసి, యూపీఐ యాప్స్ యాక్టివేట్ చేశాడు. తెలిసిన అన్ని ఆన్లైన్ పేమెంట్ యాప్స్ ఓపెన్ చేసి, సిమ్ కార్డు సాయంతో వాటిని యాక్టివేట్ చేశాడు. ఆ తర్వాత అన్నింటి నుంచి డబ్బును తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు.
ఇలా రూ.3.45 లక్షలపైగా కాజేశాడు. ఈ డబ్బుతో కొత్త మొబైల్ ఫోన్, స్కూటర్ కొనుగోలు చేశాడు. తన ఖాతా నుంచి భారీ మొత్తంలో డబ్బు పోవడం గమనించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వాళ్లు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
🧵 1/3
In a case of unauthorised #UPI transaction of Rs 3.45 lakhs by stealing sim card of the victim, #NorthEast #Cybercrime police team has arrested an accused 👤. Accused activated UPI using the victim's sim card and diverted money from victim's bank account. pic.twitter.com/yDEwlpeWuX— Anoop A Shetty, DCP North East (@DCPNEBCP) August 8, 2022