ఖానాపూర్రూరల్ : యువతిని ప్రేమించాడని కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. డీఎస్పీ ఉపేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాచర్ల అనిల్ (23)కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహరంలో గతంలో తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాలు ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. యువతి తరుఫునకు చెందిన గాజుల నాగరాజు, గాజుల గంగన్న, గాజుల రాజన్న, గాజుల నవీన్లు బుధవారం రాత్రి అనిల్ను చితకబాది కాళ్లు, చేతులు కట్టివేసి మారణాయుధాలతో దాడి చేశారని డీఎస్పీ అన్నారు.
దీంతో అపస్మారక స్థితిలో ఉన్న అనిల్ను అతడి కుటుంబ సభ్యులు ఆటోలో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నిర్మల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. కాగా పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని నిందితుల ఇళ్ల వద్దకు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 5 గంటల పాటు మృతదేహాంతో రాస్తారోకో నిర్వహించిన కుటుంబ సభ్యులను డీఎస్పీ జోక్యంతో విరమించారు. నల్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రౌడీ షీటర్, కిడ్నాప్ కేసులను నమోదు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు.