Jagtial | జగిత్యాల : జగిత్యాలలోని విజయపూరిలో దారుణం జరిగింది. అన్నదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న గొడవ బావ ప్రాణాలను బలి తీసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. విజయపూరికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు రూ. 2 వేల పెన్షన్ కోసం గొడవ పడ్డారు. అన్నదమ్ముళ్ల మధ్య గొడవను ఆపేందుకు వారి బావ వెళ్లాడు. సోదరులిద్దరూ కొట్టుకుంటుండగా, బావ తలకు కూడా తీవ్ర గాయమైంది. దీంతో బావ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాదం నెలకొంది.