నారాయణపేట : ఆర్టీసీ స్టీరింగ్ రాడ్ విరిగిపోగా.. బస్సు పంట పొల్లాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్ మండలం అనుగొండ నుంచి మక్తల్ వైపుగా వస్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ అదుపు తప్పి రోడ్డు పక్కకు ఉన్న వరి చేనులోకి వెళ్లడం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్ స్టీడింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో అదుపు తప్పి తప్పింది.
వెంటనే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కనే ఉన్న పొలాల్లోకి మళ్లించాడు. ఆ తర్వాత ఇంజిన్ ఆగిపోయేలా చూడాశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తితో పాటు చిన్నారికి గాయాలయ్యాయి. బస్సు పక్కనే దూసుకువెళ్తే విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఉండేదని, అప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొంటున్నారు. ప్రాణాపాయం లేకుండా అందరూ బయటపడడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.