జనగామ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి చెందారు. ఈ హృదయవిదాకర సంఘటన లింగాల గణపురం మండలం కుందారంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన అనంతోజు స్వాతి (36) ఇంటి వెనకాల తీగపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాకు గురై కేకలు వేసింది.
ఇంట్లోనే ఉన్న మరిది అనంతోజు ఉదయ్ కుమార్ చారి (26) వచ్చి ఆమెను లాగే ప్రయత్నం చేశాడు. దీంతో అతనికి కూడా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యుత్ ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో విషాఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల