అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అల్లూరి (Alluri) జిల్లా పాడేరు ఘాట్రోడ్లో నిన్న రాత్రి ప్రమాదవశాత్తు బొలెరో (Bolero) వాహనం లోయలోకి దూసుకెళ్లింది . ఘటనాస్థలంలో బాలిక మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 25 మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని పాడేరు ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఒడిశా (Odissa) కు చెందిన కూలీలుగా గుర్తించారు.
కృష్ణా జిల్లా(Krishna District) ఘంటసాల మండలం లంకపల్లి వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా బైక్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు( Couple) అక్కడికక్కడే చనిపోయారు . మృతులు చల్లపల్లి మండలం పచ్చర్లంక గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.