ముంబై : నవీముంబైలోని ఫ్లాట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు కుళ్లిన స్ధితిలో వేలాడుతూ కనిపించడం కలకలం రేపింది. ఐరోలి సెక్టార్ 10లోని ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ డోర్ లాక్ను బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా లక్ష్మీ పంతారి (33) ఆమె చెల్లెలు స్నేహ (26) విగతజీవులుగా పడిఉన్నారు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
సీలింగ్కు వేలాడుతున్న వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు తమ ఇంట్లోనే ప్రైవేట్ ట్యూషన్లు చెబుతుంటారని, కొన్నేండ్ల కిందట తండ్రి మరణించగా వారి తల్లి ఆత్మహత్య చేసుకుందని స్దానికులు తెలిపారు. ఇద్దరు మహిళలు చివరిసారిగా శుక్రవారం కనిపించారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.