లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోని ఆక్సిజన్ రీఫిల్లింగ్ ప్లాంట్లో బుధవారం పేలుడు జరిగింది. చిన్హాట్ ప్రాంతంలోని ఈ ప్లాంట్లో కార్మికులు సిలిండర్లను ఆక్సిజన్తో నింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఎగసిపడిన మంటలు ఆక్సిజన్ ప్లాంట్కు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడు ఎలా జరిగిందన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.