న్యూఢిల్లీ : లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలపై బిహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్ తివారీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేసే మహిళ తివారీపై ఫిర్యాదు చేసింది. గత ఏడాది జులైలో ఈ ఘటన జరిగింది. బిల్లుల చెల్లింపు గురించి మాట్లాడేందుకు మహిళను ఢిల్లీలోని ఓ హోటల్కు రప్పించిన నిందితుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
గత ఏడాది ఢిల్లీలో టీ20 మ్యాచ్లు జరిగిన తర్వాత వారిద్దరి మధ్య నగదు లావాదేవీలు జరిగాయి. ఈ గేమ్కు మహిళకు చెందిన కంపెనీ పనిచేయగా బిహార్ క్రికెట్ అసోసియేషన్ డబ్బు చెల్లించాల్సి ఉంది. అసోసియేషన్ ప్రెసిడెంట్గా రాకేష్ తివారీ ఈ చెల్లింపులు జరపాల్సి ఉంది. అయితే డబ్బు కోసం మహిళ హోటల్కు వెళ్లగా ఆమెపై లైంగిక దాడికి యత్నించిన తివారీ ఆ తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఆపై మరోసారి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో తివారీపై కేసు నమోదైంది. ఇక నోయిడాలో జరిగిన మరో ఘటనలో 31 ఏండ్ల మహిళ హైరైజ్ బిల్డింగ్పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసిన మహిళ సివిల్స్కు ప్రిపేరయ్యేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసింది. రెండుసార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన మహిళ దాన్ని క్లియర్ చేయడంలో విఫలమవడంతో కుంగుబాటుకు లోనైంది. తీవ్ర మనస్ధాపానికి గురైన మహిళ భవనం 26వ అంతస్తు నుంచి కిందకు దూకింది.