గణపురం : ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్న బీరెల్లి రమేశ్ తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్య కు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.