Building Collapse | మహారాష్ట్ర థానే జిల్లాలోని భీవండిలో రెండంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి పెరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించామని, 12 మంది గాయాలయ్యాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ (TMC) ప్రాంతీయ విపత్తు నిర్వహణ సెల్ (RDMC) అధిపతి అవినాష్ సావంత్ తెలిపారు. వల్పాడలోని వర్ధమాన్ కాంపౌండ్ వద్ద భవనం శనివారం సాయంత్రం కూలిపోయింది. పైఅంతస్థులో నలుగురు కుటుంబీకులు ఉండగా.. గ్రౌండ్ఫ్లోర్లో కొందరు కూలీలు ఉన్నారు.
సమాచారం అందుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందజేస్తామన్నారు. వర్షాకాలంలో ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్న శిథిలావస్థలో ఉన్న భవనాలపై సర్వే నిర్వహించాలని కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులను ఆదేశించారు.