బెంగళూరు: బర్త్డే పార్టీకి వెళ్లిన ఒక యువకుడికి పెయిన్కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో విషమయమైన అతడి చేతిని తొలగించాల్సి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 17 ఏండ్ల యువకుడు మే 31న రాత్రి తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు వెళ్లాడు. కాగా, బర్త్ డే పార్టీ ఇచ్చిన అతడి స్నేహితుడు కాలేజీ చదువును మధ్యలోనే ఆపేశాడు. డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో పార్టీకి వచ్చిన వారికి మత్తుపదార్థాలు సరఫరా చేశాడు. గంజాయి కన్నా మత్తు ఇస్తుందంటూ యువకుడితోపాటు మరో ఇద్దరికి నొప్పినివారణ మాత్ర పొడిని నీటిలో కలిసి ఇంజెక్షన్గా ఇచ్చాడు.
కాగా, నాలుగు రోజుల తర్వాత ఆ యువకుడి చేయి వాచింది. ఆందోళన చెందిన తల్లి అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆ యువకుడి చేయి విషపూరితమైందని తెలిపారు. చివరకు శస్త్రచికిత్స చేసి మోచేతిని తొలగించారు. యువకుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.